పనీర్‌ మేథీ చమన్‌


కావలసిన పదార్థాలు...
పనీర్‌ - 200 గ్రా
మెంతికూర - 3 కట్టలు
పాలకూర - 8 కట్టలు
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - టీస్పూను
పచ్చిమిర్చి - 4
జీలకర్ర - పావు టీస్పూను
సోంపు - పావు టీస్పూను
గరం మసాలా - కొద్దిగా
కారం - అర టీస్పూను
జీడిపప్పు, గసగసాల పేస్ట్‌ - 2 టేబుల్‌ స్పూన్లు
తయారు చేసే విధానం...
మెంతి ఆకుల్ని తుంచి బాగా కడగాలి. పనీర్‌ని సన్నగా తుర మాలి లేదా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పాల కూర కడిగి సన్నగా కోయాలి. ఉల్లి, పచ్చి మిర్చి కూడా చిన్నగా తగిరి పాలకూరలో కలపాలి. తరు వాత బాణలిలో వేసి ఉడికించుకోవాలి. తరువాత దానిలో వుండే నీటిని వార్చి మెత్తగా రుబ్బుకోవా లి. జీల కర్ర, సోంపు పొడులు చేసి పెట్టుకోవాలి. ఓ బాణలిలో నూనె పోసి, మెంతి కూర వేసి బాగా వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి, కారం వేసి మరికాసేపు వేయించాలి. తరువాత జీడి పప్పు, గరం మసాలా పేస్ట్‌ వేసి బాగా కలపాలి. ఇప్పుడు పాలకూర ముద్దను కూడా వేసి ఉడికించాలి. ఇది గ్రేవీలా తయారవుతుంది. ఇందులో పనీర్‌ ముక్కలు, మసాలా పొడులు వేసి ఉడికించాలి. తరువాత మీగడ వేసి ఉప్పు సరిచూసి దించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top