ప్యాజ్‌ పనీర్‌ కచోరి


కావల్సినవి: 
 పనీర్‌ తురుము - కప్పు, ఉల్లిపాయలు - రెండు (సన్నగా తరగాలి), వాము - చెంచా, నెయ్యి - పావుకప్పు, జీలకర్ర, ఇంగువ - పావుచెంచా చొప్పున, కొత్తిమీర తురుము - అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది (పలుకుల్లా తరగాలి), పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి), ఉప్పు - రుచికి తగినంత, మైదా - అరకేజీ, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ: 

మైదాను ఓ గిన్నెలోకి తీసుకుని టేబుల్‌స్పూను నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి.. నీటితో పిండిలా కలిపి ఇరవైనిమిషాలు నాననివ్వాలి. బాణలిలో చెంచా నెయ్యి కరిగించి వాము, జీలకర్ర, ఇంగువ వేయించి ఆ తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పలుకులు చేర్చాలి. ఉల్లిపాయముక్కలు బాగా వేగాక.. తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము కలిపి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మైదాను ఉండల్లా చేయాలి. ఒక ఉండను తీసుకుని పూరీలా వత్తి మధ్యలో కొద్దిగా పనీర్‌తురుము, ఉల్లిపాయ మిశ్రమం వేసుకుని గుండ్రంగా వచ్చేలా చుట్టూ మూసేయాలి. ఫోర్కుతో అక్కడక్కడా రంథ్రాల్లా పెట్టి కాగుతున్న నూనెలో వేయించాలి. బంగారువర్ణంలోకి వచ్చాక దింపేయాలి. ఇలా మిగతా పిండినీ చేసుకోవాలి. వేడివేడిగా పెరుగుచట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయివి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top