కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చొనే వారి కోసం....మత్స్యాసనం

సాధారణంగా ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చోవటం ఎక్కువ అయ్యిపోయింది. దాంతో మెడ నొప్పి,నడుము నొప్పి వంటి సమస్యలు రావటం కూడా సహజం అయ్యింది. ఇప్పుడు ఆ ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందాం.

CLICKHERE : పవన్ ఫస్ట్ హీరోయిన్ చెప్పిన షాకింగ్ విషయాలు


మొదట పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. నెమ్మదిగా మోచేతుల సాయంతో వెల్లకిలా పడుకోవాలి. తలను వెనుకకు వంచి నేలను తాకాలి. శరీరం మధ్య భాగాన్ని సాగదీయాలి. చూపుడువేలుతో బొటనవేళ్లు పట్టుకుని, మోచేతులను అదే సమయంలో నేలపైన ఉంచాలి . కొంచెం సేపు అలానే ఉండాలి. నిదానంగా ఊపిరి తీసుకుంటూ పూర్వ స్థితికి రావాలి. ఈ ఆసనం మెడ, పొట్ట, కటి ప్రాంతం మీద పనిచేస్తుంది. 

ఈ ఆసనం యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం. నాడీ వ్యవస్థను, పేగులను,మూత్రపిండాలను, కటి సంబంధిత అవయవాలను బలోపేతం చేస్తుంది. కంప్యూటర్‌ దగ్గర ఎక్కువ సమయం పనిచేసే వారు ఈ ఆసనం చేస్తే స్పాండిలైటిస్‌ వంటి వ్యాధుల బారి నుండి తప్పించుకోవచ్చు. 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top