ప్రధాని నరేంద్ర మోడి నల్లధనం,నకిలీ కరెన్సీ అరికట్టడానికి రూ 1000,500 నోట్లను రద్దు చేసి సంచలనం సృష్టించారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా మోడీకి ప్రశంసల జల్లు కురిసింది. ఈ నిర్ణయంతో నల్లదనం ఉన్న కుబేరులు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
కొంతమంది నల్లదనాన్ని బంగారం రూపంలోకి మార్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మరో షాక్ ఇవ్వనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో బ్యాంకు లాకర్లపై దాడులకు కేంద్ర ప్రభుత్వం ప్రణాలికలు రచిస్తోంది.
ముఖ్యంగా లాకర్లలో ఉన్న బంగారానికి సంబంధించి కొన్ని నిబంధన లు ప్రవేశ పెట్టబోతుందని సమాచారం. అవి ఇలా ఉన్నాయి.
* మీకున్న బంగారం లాకర్లను తహశీల్దారు లేదా సి ఐ సమక్షంలో ఓపెన్ చేయాలి.
* లాకర్ లో పట్టుబడ్డ బంగారానికి లెక్క చూపాలి
* కొన్న బంగారానికి రసీదులు ఉండాలి
* ఒక్కో లాకర్ లో ఒక్కో మహిళకు కేవలం 600 గ్రాముల వరకు అనుమతి
* ఎక్కువ బంగారం ఉంటే ఐటీ లెక్కలు ఉండాలి.
ముఖ్యంగా లాకర్లలో ఉన్న బంగారానికి సంబంధించి కొన్ని నిబంధన లు ప్రవేశ పెట్టబోతుందని సమాచారం. అవి ఇలా ఉన్నాయి.
* మీకున్న బంగారం లాకర్లను తహశీల్దారు లేదా సి ఐ సమక్షంలో ఓపెన్ చేయాలి.
* లాకర్ లో పట్టుబడ్డ బంగారానికి లెక్క చూపాలి
* కొన్న బంగారానికి రసీదులు ఉండాలి
* ఒక్కో లాకర్ లో ఒక్కో మహిళకు కేవలం 600 గ్రాముల వరకు అనుమతి
* ఎక్కువ బంగారం ఉంటే ఐటీ లెక్కలు ఉండాలి.