స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హోల్డర్స్కు ఆ బ్యాంక్ షాక్ ఇచ్చింది. నెట్ బ్యాంకింగ్ నుంచి పేటీఎం, ఫ్రీచార్జ్, మొబిక్విక్, జియో మనీ, ఎయిర్టెల్ మనీ వంటి వ్యాలెట్ సర్వీసుల్లోకి డబ్బును ట్రాన్స్ఫర్ చేయడంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లాక్ చేసింది. అయితే స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియానుంచే వచ్చిన ఈ – వ్యాలెట్ స్టేట్ బ్యాంక్ బడ్డీ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బును ఇతర ఈ – వ్యాలెట్ సర్వీసుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
CLICKHERE : లక్షలు ఖర్చు చేసినా తగ్గని నొప్పి చింతగింజలతో తగ్గించొచ్చు
ఇటీవలి కాలంలో అకౌంట్లు హ్యాకింగ్ బాగా జరుగుతుండటంతో తమ కస్టమర్ల ఖాతాలకు ముప్పు వాటిల్లే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది.అయితే.. నోట్ల రద్దు నేపథ్యంలో ఈ-వ్యాలెట్ సర్వీసులే నగదుకు ప్రధాన ప్రత్యామ్నాయంగా మారాయని, అలాంటి సర్వీసుల్లో డబ్బు జమను అడ్డుకోవడానికి కారణాలేంటో వివరించాలని ఎస్బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.