మొబైల్ లో పేస్ బుక్ ఉపయోగించే వాళ్ళకు షాక్ తగల నుందా? అంటే.. అవుననే వార్తలు వస్తున్నాయి. కారణం.. మొబైల్ లో పేస్ బుక్ చాటింగ్ ని క్లోజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మొబైల్ లో బ్రౌసర్ ద్వారా పేస్ బుక్ వాడే వాళ్ళకు ఇకపై చాటింగ్ చేసే అవకాశాన్ని తొలగించనున్నారు.
డానికి కారణం ఏమిటంటే.. చాటింగ్ కోసం పేస్ బుక్ సంస్థ ప్రత్యేకంగా ‘మెసెంజర్’ యాప్, పేస్ బుక్ యాప్ లను తయారు చేసింది. ఇప్పటికే మెసెంజర్ యాప్ ని ఎంతో మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.ఈ నేపధ్యంలో పేస్ బుక్ వాడే వాళ్ళకు చాటింగ్ ని క్లోజ్ చేస్తే.. సదరు యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని.. దానిని ఉపయోగించు కోవాలనే ఆలోచనగా కనిపిస్తుంది. అయితే.. డెస్క్ టాప్ యూజర్ లకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. పేస్ బుక్ తీసుకోబోతున్న తాజా నిర్ణయంతో.. స్మార్ట్ ఫోన్ లు ఉన్నవాళ్ళు మాత్రమే చాటింగ్ చేసుకోగలరు.
దీనితో మిగిలిన వారు చాటింగ్ చేసుకునే అవకాశం ఉండదని వాపోతున్నారు