గుడిలో షడగోప్యం (శతగోపనం) తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది ?


దేవాలయం లో దర్శనం అయ్యాక తీర్దం, షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక, చకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. కొద్ది మంది మాత్రమే ఆగి, షడగోప్యం పెట్టించుకుంటారు. 

షడగోప్యం అంటె అత్యంత రహస్యం. అది పెట్టె పూజారికి కూడా విన్పించనంటగా కోరికను తలుచుకోవాలి. అంటె మీ కోరికే షడగోప్యం. మానవునికి శత్రువులైన కామమూ, క్రొధమూ, లొభమూ, మొహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసు కోవటము మరో అర్ధం. 

సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, షడ గోప్యము ను వక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చేయద్దు. పూజారి చేత షడ గోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. షడ గోప్యమును రాగి, కంచు, వెండి లతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. 

షడ గోప్యము ను తల మీద ఉంచినప్పుడు శరీరం లో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికి వెళ్ళుతుంది. తద్వారా శరీరం లో ఆందోళనా, ఆవేశామూ తగ్గుతాయి. షడ గోప్యమును శతగోపనం అని కూడా అంటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top