గోర్లు పెళుసుగా మారుతున్నాయా?

కొందరికి గోళ్ళు పెళుసుగా ఉండి తొందరగా విరిగిపోవటం జరుగుతుంది. అలాంటప్పుడు కొన్ని పదార్దాలను తరచుగా తీసుకుంటూ ఉంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. శరీరంలో బయోటిన్ లోపిస్తే ఇలాంటి సమస్య ఎదురవుతుంది. 

ఈ లోపం లేకుండా ఉండాలంటే అరటి పండ్లు,బీన్స్,క్యాలిఫ్లవర్,గుడ్లు,ఎర్ర కందిపప్పు,చేపలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ప్యాటి ఆమ్లాలు ఎక్కువగా ఉన్న అవిసె గింజలు,చేప నూనె,పాలకూర,వాల్ నట్స్ వంటి ఆహారాలు తీసుకోవాలి.

ప్రోటీన్ లోపం కారణంగా కూడా గోళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. అవి దూరం కావాలంటే ప్రోటీన్ సమృద్దిగా లభించే చికెన్,వెన్న తీసిన పాలు,పప్పులు,సోయా బీన్, తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.

గోళ్ళ ఆరోగ్యానికి విటమిన్ ‘ఎ’ ఎంత అందితే అంత మంచిది. దీని కోసం అఫ్రికాట్స్,గుడ్డులోని తెల్లసొన,చీజ్,ఓట్ మీల్,తోటకూర వంటివి తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకుంటూ గోళ్ళకు గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. అలాగే బాదం నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి గోళ్ళకు రాసినా మంచి పలితం కనపడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top