ఉపవాసం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

ఉపవాసం వలన శరీరంలో జీవక్రియలు పాక్షికంగా స్తంభించిపోతాయి. దాని ప్రభావం శరీరంలోని ద్రవాల సమతుల్యంపై పడుతుంది. అంతేకాక నీటి శాతం తగ్గిపోవటం వలన డిహైడ్రేషన్ బారిన పడటం కూడా జరుగుతుంది. ఉపవాసాలు తప్పనిసరిగా ఉండాల్సిన సమయంలో ఇంటి పనులు తగ్గించుకోవటం,ఎండలోకి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.తరచుగా ఉపవాసాలు చేయటం వలన గుండెల్లో మంట,అల్సర్లు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. 

ఉపవాసం పేరిట మధ్యాహ్నం భోజనం మానేసి రాత్రి సమయంలో మితిమీరి ఆహారం తీసుకోవటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇన్సులిన్ వేగం తగ్గుతుంది. ఇది డయాబెటిస్ కి దారి తీయవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినప్పుడు దాన్ని తట్టుకొవటానికి శరీరం కొన్ని రకాల హార్మోన్స్ ని విడుదల చేస్తుంది.దాంతో రక్తపోటు పెరిగి రక్తనాళాలు కుచించుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఉపవాసం ఉన్న సమయంలో ఎక్కువగా మంచి నీటిని త్రాగాలి. 

చాలా మంది ఉపవాసం సమయంలో పండ్ల రసాలను త్రాగుతూ ఉంటారు. కానీ ఆ సమయంలో పండ్ల రసాలకు బదులు కొబ్బరి నీటిని త్రాగితే మంచిది. ఉపవాసం విరమించిన తర్వాత పీచు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. ఉపవాసం వలన అవయవాల పనితీరు దెబ్బతింటుంది. అందువల్ల ఉపవాసాలు అనివార్యం అయితే తప్ప ఎక్కువగా చేయకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top