ప్రతి రోజు ఉద్యోగాలు అంటూ బయటకు వెళ్ళే మహిళలకు ఫేస్ స్క్రబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారు బయటకు వెళ్లినప్పుడు దుమ్ము ముఖం మీద పేరుకుపోతుంది. ఈ దుమ్ము,మురికిని వదిలించుకోవటానికి ఈ స్క్రబ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ స్క్రబ్ లను మార్కెట్ లో కొనే కన్నా ఇంటిలో తయారుచేసుకుంటేనే మంచిది. అలాగే మనకు సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతోనే
ఈ స్క్రబ్ ని ఇంటిలో తయారుచేసుకోవచ్చు.
రెండు స్పూన్ల బియ్యం పిండికి నాలుగు స్పూన్ల తేనే, కొంచెం రోజ్ వాటర్ కకలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే చర్మం మీద పేరుకున్న దుమ్ము,మురికి వదిలి ముఖం క్లీన్ గా ఉంటుంది.
గుమ్మడికాయతో కూర వండుకోవచ్చు,వడియాలు పెట్టుకోవచ్చనే విషయాలు మాత్రమే మనకు తెలుసు. కానీ గుమ్మడి కాయ గుజ్జు ముఖ సౌందర్యానికి సహాయపడుతుందని మీకు తెలుసా? మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదూ. గుమ్మడికాయ గుజ్జులో ఒక గుడ్డు తెల్లసొన,రెండు స్పూన్ల పచ్చి పాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ స్క్రబ్ ముఖం మీద మొటిమలు,మచ్చలను మాయం చేస్తుంది.