వర్షంలో తడిచి ఇంటికి వెళ్లగానే ముందు తల తుడుచుకుంటారు. మరింత జాగ్రత్తగా ఉండేవారు వేడి నీళ్లతో స్నానం చేసి పడుకుంటారు. అంతేగాని...వర్షపునీటిలో నానిన పాదాల గురించి ఆలోచించరు. రోడ్డుపై ఉన్న చెత్తచెదాలతో కూడిన మురికినీటిలో నానిన పాదాలకు ఫంగస్ ఇన్షెక్షన్ వస్తుంది. ఎలర్జీల వల్ల దురదలు, పొక్కులు వంటివి కూడా వస్తాయి. ఈ సమస్యలేవి మీ పాదాలజోలికి రాకుండా ఉండాలంటే మసాజ్ ఒక్కటే మార్గం. ఇంటికెళ్లగానే గోరువెచ్చటి నీళ్లలో పదినిమిషాలు పాదాలను ఉంచి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీళ్లలో కొద్దిగా పసుపు వేసుకుంటే మంచిది. తర్వాత పాదాలను శుభ్రంగా తుడిచి తడి ఆరిపోయాక ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్తో ఓ పదినిమిషాలు మసాజ్ చేయాలి. వేళ్లమధ్య క్రీములేకుండా తుడిచేయాలి. లేదంటే నీళ్లలో నానిన పాదం కాబట్టి వేళ్లమధ్య తడి ఉంటే ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో సాక్సులు వేసుకోకపోవడమే ఉత్తతం. ఎందుకంటే వర్షంలో తడిచినపుడు నానిన సాక్సుల వల్ల కూడా ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
వర్షపునీటిలో నానిన పాదాల గురించి.....
teluguLifestyle Editor
10:30:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.