![]() |
బజ్జీ మిర్చి-10
కొబ్బరి తురుము-రెండు టీ స్పూన్లు
ధనియాలు-టీ స్పూన్
ఉప్పు-తగినంత
నువ్వులు-రెండు టీ స్పూన్లు
చింతపండుగుజ్జు-రెండు టీ స్పూన్లు
శనగపిండి-రెండు కప్పులు
బియ్యప్పిండి-రెండు కప్పులు
వంటసోడా-చిటికెడు
రిఫైన్డ్ ఆయిల్-డీప్ ఫ్రైకి సరిపడా
ఉల్లితరుగు-అరకప్పు
కొత్తిమీర-ఒక కట్ట
తయారి:
- ముందుగా నువ్వులు, ధనియాలను వేయించి పక్కనపెట్టుకోవాలి.
- తరువాత మిక్సీలో వేయించిన నువ్వులు, ధనియాలు, కొబ్బరితురుము, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండుగుజ్జు కలిపి ఆమిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
- మిరపకాయలను మధ్యకి కట్చేసి గింజలను తీసేయాలి.
- బాణలిలో అయిదారు గ్లాసుల నీరు, చిటికెడు ఉప్పు వేసి స్టౌ మీద పెట్టి నీరు మరిగిన తరువాత కట్ చేసి పెట్టిన మిరపకాయలను అందులో వేసి కాసేపు ఉడికించాలి.
- కట్చేసి పెట్టిన మిరపకాయలలో పైన చేసిపెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి.
- ఒక గిన్నెలో బియ్యప్పిండి, శనగపిండి, వంటసోడా, తగినంత ఉప్పు, నీరు పోసి గరిటజారుగా కలుపుకోవాలి.
- బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత కలిపి పెట్టుకున్న పిండిలో మిరపకాయలను ముంచి నూనెలో వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించి పక్క న పెట్టుకుని కాసేపటి తరవాత వేడి నూనెలో వేసి మళ్ళీ తియ్యాలి. అలా చేస్తే కరకరలాడతాయి.
- ఉల్లిపాయ ముక్కల్లో నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి బజ్జీలను గార్నిష్ చెయ్యాలి.