శుచీంద్రంలోని శ్రీస్థానేశ్వర స్వామి ఆలయంలోని హనుమంతుని మందిరంలో ఈ ఆనవాయితీ ఉంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామిని వెన్నతో పూజించి ఆరాధిస్తారు. అందువల్ల ఈ హనుమంతుణ్ని దర్శించుకునే భక్తులు తమ వెంట కొబ్బరికాయలకు బదులు వెన్న తీసుకువెళతారు. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి పుణ్యక్షేత్రానికి 17 కి.మీల దూరంలో ఉంది.