రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారం
శరీరంలో రోగ నిరోధకశక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కలుషిత నీటివల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నింటి నుండి తప్పించుకోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. సరైన ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించవచ్చంటు న్నారు పోషకాహార నిపుణులు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.విటమిన్లు :
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్పై పోరాడి ఇన్ఫెక్షన్లు రాకఒుండా కాపాడుతుంది. టమాట, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్ సి ఉంటుంది.
జింక్ :
శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పునః నిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్స్, సీఫుడ్లలో జింక్ లభిస్తుంది.
పెరుగు :
ప్రతి రోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.
కెరోటిన్ :
ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి.
వెల్లుల్లి :
దీనిలో ఉండే మినరల్స్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫె క్షన్లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్ వెల్లుల్లి రసం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
ఐరన్:
రోజూ నాలుగు లేదా ఐదశ్హు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్ పెరుగుతుంది.
పొటాషియం :
దీనిలో విటమిన్ సి, పొటాషియం అధిక మోతా దులో ఉంటాయి. దీని వల్ల అధిక రక్తపోటుని తగ్గించి శక్తిని పెంచుతుంది.