చెంచాల శొంఠి కషాయంలో ఒక చెంచాడు ఆముదం (ఏరండ తైలం) కలిపి రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తే విరేచనం సాఫీగా అవుతుంది. కడుపులో వాయువు తగ్గుతుంది. సయాటికా తగ్గుతుంది. ఇలా రోజు విడిచి రోజు మూడుసార్లు చేయవచ్చు. శొంఠిని నీటితో అరగదీసి ఆ ముద్దను నొసటిపై, కణతలపై పూతగా పూస్తే ఏ కారణంతో వచ్చిన తలనొప్పికైనా కొద్దిసేపట్లో ఉపశమనం లభిస్తుంది. శొంఠి కషాయంతో హృద్రోగాలు, కీళ్లనొప్పులు, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు.