![]() |
కావలసిన పదార్థాలు :
మైదాపిండి-ఒక కేజినెయ్యి-800గ్రా
పంచదార పొడి-ఒకటిన్నర కిలో
జీడిపప్పు-పావు కిలో
హార్లిక్స్-200గ్రా
అమూల్ స్ప్రే-800గ్రా
జాజికాయ, జాపత్రి-5గ్రా
యాలకుల పొడి-25గ్రా
కిస్మిస్-100గ్రా
పిస్తాపప్పు-150గ్రా
బాదంపప్పు-200గ్రా
తయారుచేసే విధానం :
స్టవ్పై కళాయి ఉంచి నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో మైదాపిండి వేసి సన్నటి మంటపై వేయించాలి. మైదా వేగిందో లేదో తెలియాలంటే ఒక నీటి చుక్క మైదాపిండిపై వేయాలి. అది పొంగితే మైదాపిండి వేగిందని అర్థం. ఇలా వేగిన మైదాను ఒక గిన్నెలోకి తీసి చల్లార్చాలి. పూర్తిగా చల్లారాక అందులో అమూల్ స్ప్రే, హార్లిక్స్, పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఒకవేళ పిండి బాగా మెత్తగా ఉంటే పంచదార పొడి మరికొంత వేసుకోవచ్చు. తర్వాత జీడిపప్పు, పిస్తాపప్పు, బాదంపప్పు చిన్న చిన్న ముక్కలుగా కోసి నేతిలో వేయించి ఈ పిండిలో వేయాలి. కిస్మిస్, యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి కూడా చేర్చి నెమ్మదిగా కలపాలి. ఇలా తయారైన లడ్డు పిండి కాసేపు ఆరాక అరచేతికి నెయ్యిగాని నూనెగాని రాసుకుని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి.