![]() |
కావలసిన పదార్థాలు :
ఖర్జూర పండు-ఒక కేజిబెల్లం-300గ్రా
పంచదార-20
సారపప్పు-150గ్రా
ఎండుకొబ్బరి-50గ్రా
యాలకుల పొడి-10గ్రా
నెయ్యి-పావు కిలో
గసగసాలు-100గ్రా
జీడిపప్పు-ఒక కేజి
ఆక్రోట్పప్పు-100గ్రా
బాదంపప్పు-200గ్రా
పిస్తాపప్పు-౨౦౦-గ్రా
అంజీర్ పప్పు-200గ్రా
గ్లూకోజ్ లిక్విడ్-50 మిల్లీలీటర్లు.
తయారుచేసే విధానం :
ముందుగా ఖర్జూర పండులోని విత్తనాలు తీసేసి పొడవాటి ముక్కలుగా చేసుకోవాలి. బాదంపప్పు, పిస్తాపప్పు, ఖుబానీలను పొడవైన ముక్కలుగా కోసుకోవాలి.వీటన్నింటినీ విడివిడిగా ఉంచుకోవాలి. అంజీర్ పప్పు, ఆక్రోట్ పప్పును చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక కళాయి స్టవ్పై ఉంచి అందులో అరలీటరు నీరు పోసి, పంచదార, బెల్లం వేసి కలుపుతూ ఉండాలి.
మరీ లేత, మరీ ముదురు పాకం కాకుండా సమపాకం పట్టుకొని గ్లూకోజ్ లిక్విడ్ అందులో వేసి కలపాలి. తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఖర్జూరం ముక్కలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి కళాయిని కిందికి దింపేయాలి.
మరో బాణలి స్టవ్పై ఉంచి అందులో నెయ్యి వేసి బాదంపప్పు, పిస్తాపప్పు, సారపప్పు, ఆక్రోట్ పప్పు, జీడిపప్పు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత అందులో అంజీర్పప్పు, ఖుబానీ, గసగసాలు వేసి మరో రెండు నిమిషాలపాటు వేగించి ఆ మొత్తాన్ని ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి యాలకుల పొడి కూడా కలిపి, కాస్త వేడిమీద ఉండగానే ఉండలుగా చుట్టుకోవాలి.