మహా భాగవతంలో గర్భంలోని శిశువు దశలన్నీ చాలా వివరంగా ఆధునిక వైద్యశాస్త్రం వివరించిన విధంగానే ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు కూడా మూడో స్కంధంలో ఉన్నాయి. ఆ స్కంధం ప్రకారం, గర్భస్థ శిశువులో నాలుగు మాసాలు పూర్తి అయ్యేసరికి సప్తధాతువులు ఏర్పడతాయి. ఆకలి, దృష్టి కలుగుతాయి. ఆరు మాసాలకు ఆ పిండాన్ని మావి ఆవరిస్తుంది.
కడుపులో కుడివైపుగా పిండం కదులుతూ ఉంటుంది. ఏడో నెలలో గ త జన్మలు, కర్మలు, అతని స్మరణకు వస్తాయి. తాను మాయచే ఈ లోకంలో బంధించబడుతున్నట్లు తెలుసుకుంటాడు. తల్లి తిన్న ఆహారమే తన శరీరంలో వేడిని కలిగించి, ధాతువుల్ని వృద్ధిపరుస్తుంది. ఆమె తిన్న ఉప్పు పులుపు, కారం అతనికి చాలా వేదన కలిగిస్తాయి. మావిచేత చుట్టబడి, పంజరంలో బంధించబడిన పక్షివలె చేష్టలుడిగి ఉంటాడు. సుఖ దుఃఖాలు తెలుస్తుంటాయి. జ్ఞానం కలుగుతూ ఉంటుంది. లోపల వీచే ప్రసవ వాయువుల వల్ల దుఃఖం కలుగుతుంది. భయపడిపోయి తనకీ గర్భవాసం అనే నరకం మరోసారి కలుగచేయవద్దని భగవంతుని ప్రార్థిస్తాడు. పుట్టడం తనకు ఇష్టం లేకపోయినా. ప్రసూతి వాయువు అతన్ని తల్లిగర్భం నుంచి వెలుపలికి తోసేస్తుంది. జ్ఞానం పోయి అజ్ఞానం ఆవరించి ఏడుస్తాడు.
గర్భస్థ శిశువు గురించి పురాణాల్లో ఉందా?
teluguLifestyle Editor
2:14:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.