ఒక బౌల్లోకి అర కప్పు పెసరపిండి తీసుకుని దానిలో కీరా తురుము, ఆరెంజ్జ్యూస్, ఒక గుడ్డుసొన వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ను ముందు రోజు సాయంత్రం షాంపూతో తలస్నానం చేసి మర్నాడు ఉదయం తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఎంతో ఆరోగ్యవంతంగా మెరుస్తూ ఉంటుంది.