సగ్గుబియ్యం వంకాయవేపుడు


కావల్సినవి: 
 మినప్పప్పు, సెనగపప్పు, ధనియాలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము- రెండు చెంచాల చొప్పున, ఎండుమిర్చి- పది, జీలకర్ర- చెంచా, జాజికాయ- కొద్దిగా, జీడిపప్పు- పది, కరివేపాకు-నాలుగురెబ్బలు, పొడుగు వంకాయలు- పావుకేజీ, పచ్చిమిర్చి- నాలుగు, సగ్గుబియ్యం- రెండుకప్పులు, ఉప్పు- రుచికి తగినంత నెయ్యి, నూనె- రెండు చెంచాల చొప్పున, నిమ్మకాయం- ఒకటి.
తయారీ:  
సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి మినప్పప్పు, సెనగపప్పు, ధనియాలు, నువ్వులు, ఎండుకొబ్బరి, జీలకర్ర, జాజికాయ వేసి వేయించి చల్లారాక మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. అదే బాణలిలో నిలువుగా తరిగిన వంకాయ ముక్కలను వేయించి వాటికి నూరిపెట్టుకున్న మసాలా పొడి కలిపి పక్కనపెట్టుకోవాలి. తరవాత మరో బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, వంకాయలు వేసి ఎర్రగా వేయించి దానిలో సరిపడా ఉప్పు, పసుపు కలపాలి. కొద్దిసేపటికి నానిన సగ్గుబియ్యం, ముందుగా తయారు చేసుకొన్న మసాలా పొడి సగం వేసి వేయించాలి. తరవాత వంకాయ ముక్కలు  చేర్చాలి. చివరిగా నిమ్మరసం పిండి దించేస్తే వేడివేడి సగ్గుబియ్యం వంకాయవేపుడు సిద్ధమయినట్టే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top