కావల్సినవి:
మైదాపిండి- కప్పు, బొంబాయి రవ్వ- పావు కప్పు, నూనె- కప్పు, వంటసోడా- చిటికెడు, బంగాళాదుంపలు- రెండు(ఉడికించి మెత్తగా మెదపాలి), సెనగలు- అరకప్పు (నానబెట్టి.. ఉడికించాలి), పెరుగు- పావుకప్పు, జీలకర్ర - చెంచా, ఉప్పు, కారం- రుచికి తగినంత, చింతపండు గుజ్జు- కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, కొత్తిమీర- అలంకరణకు కొద్దిగా.
తయారీ:
గిన్నెలో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, వంటసోడా, కొద్దిగా నూనె తీసుకొని అందులో కాసిని నీళ్లు జోడించి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. దానిమీద తడి వస్త్రాన్ని కప్పి ఉంచాలి. కొద్దిసేపటికి పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి ఒత్తుకోవాలి.. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి వాటిని వేయించి పెట్టుకోవాలి. తరవాత మరో బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి వేగాక బఠాణీ, బంగాళాదుంప ముద్ద, పెరుగు, కొద్దిగా చింతపండు, కారం, ఉప్పు వేసి కొద్దిసేపటికి దించేయాలి. ఇప్పుడు పళ్లెంలో వేయించిన పూరీలను ఉంచి బంగాళాదుంప మిశ్రమం.. పైన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీరతో అలంకరించుకొంటే పూరీల చాట్ సిద్ధమయినట్టే. ఈ చాట్ను టమాటాసాస్తో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.
మైదాపిండి- కప్పు, బొంబాయి రవ్వ- పావు కప్పు, నూనె- కప్పు, వంటసోడా- చిటికెడు, బంగాళాదుంపలు- రెండు(ఉడికించి మెత్తగా మెదపాలి), సెనగలు- అరకప్పు (నానబెట్టి.. ఉడికించాలి), పెరుగు- పావుకప్పు, జీలకర్ర - చెంచా, ఉప్పు, కారం- రుచికి తగినంత, చింతపండు గుజ్జు- కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, కొత్తిమీర- అలంకరణకు కొద్దిగా.
తయారీ:
గిన్నెలో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, వంటసోడా, కొద్దిగా నూనె తీసుకొని అందులో కాసిని నీళ్లు జోడించి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. దానిమీద తడి వస్త్రాన్ని కప్పి ఉంచాలి. కొద్దిసేపటికి పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి ఒత్తుకోవాలి.. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి వాటిని వేయించి పెట్టుకోవాలి. తరవాత మరో బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి వేగాక బఠాణీ, బంగాళాదుంప ముద్ద, పెరుగు, కొద్దిగా చింతపండు, కారం, ఉప్పు వేసి కొద్దిసేపటికి దించేయాలి. ఇప్పుడు పళ్లెంలో వేయించిన పూరీలను ఉంచి బంగాళాదుంప మిశ్రమం.. పైన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీరతో అలంకరించుకొంటే పూరీల చాట్ సిద్ధమయినట్టే. ఈ చాట్ను టమాటాసాస్తో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.