ఆకుకూరల గారెలు


కావల్సినవి: 
పాలకూర, చుక్కకూర, తోటకూర ఆకులు - కప్పు చొప్పున, అల్లం - చిన్న ముక్క, జీలకర్ర - చెంచా, పచ్చిమిర్చి - ఐదు, కరివేపాకు - నాలుగు రెబ్బలు, నూనె - వేయించడానికి సరిపడా, మినప్పప్పు - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత.
కావల్సినవి: 
మినప్పప్పును మూడుగంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత ఆకుకూరల్ని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. అన్నింటినీ మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి. నానిన పప్పును మరోసారి కడిగి అందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి రుబ్బుకోవాలి. ఆ పిండిని గిన్నెలోకి తీసుకొని ఆకుకూరల మిశ్రమం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి పిండిని గారెల్లా అద్ది వేయించాలి. బాగా వేగాక దించేస్తే సరిపోతుంది. వేడివేడి ఆకుకూరల గారెల్ని కొబ్బరి చట్నీతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top