ఒక కప్పు కాఫీ ధర అక్షరాలా 5, 700 రూపాయలు మీకు తెలుసా.......


అత్యంత ఖరీదైన కాఫీని లండన్ రెస్టారెంట్ వాళ్లు తయారు చేయనున్నారు. దానిని పామ్ సివెట్ అనే పిల్లిరకం జాతికి చెందిన జంతువు విసర్జించిన వ్యర్థ చెర్రీస్ గింజల నుంచి తయారు చేస్తున్నట్టు రెస్టారెంట్ నిర్వాహకులు ప్రకటించారు. ఇండోనేషియాలోని సుమత్ర దీవిలో ఉండే ఈ సివెట్‌లు అక్కడ పండే చెర్రీస్‌ను తింటాయి. ఆ చెర్రీస్‌లో ఉండే గింజలను సివెట్‌లు జీర్ణం చేసుకోలేవు.అవి మలం ద్వారా బయటకు వస్తాయి. అలా దొరికే గింజలకు విపరీతమైన డిమాండ్ ఉంది. సివెట్‌ల జీర్ణాశయంలో ఉండే గ్యాస్ ఆ గింజల్లో ఒక రకమైన టేస్ట్ రావడానికి కారణమవుతుంది. అందుకే ఆ గింజలకు డిమాండ్ ఎక్కువట. అలా సేకరించిన గింజల ద్వారా ఈ కాఫీ తయారు చేస్తున్నారు. ఇంతకీ ఈ కాఫీ ధర చెప్పనేలేదు కదూ.. ఒక కప్పు తాగాలంటే 5, 700 రూపాయలు చెల్లించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top