బట్టలను మగ్గాలపై నేస్తారు. అలా నేసేముందు నూలుకు గంజి పెడతారు. ఆ గంజిని పిండి తో చేస్తారు. దీని వల్ల అనేక రోగ క్రిములు వస్త్రాల్లో చేరతాయి. ఆ వస్త్రాలను ధరిస్తే చర్మ సంభందిత రోగాలు వస్తాయి. క్రిములను పసుపు చంపేస్తుంది . అందుకే పసుపు రాసిన తర్వాతే కొత్త దుస్తులు ధరించమని పెద్దలు చెపుతారు. అయితే ప్యాషన్ పెరిగే కొద్ది ఈ అలవాటు మెల్లగా తగ్గిపోయింది. ఎవరో కొందరు మాత్రమే ఇప్పుడు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.