మానసికి ఒత్తిడిలో ఉన్నప్పుడు పొట్టలోకి ఆహారం పంపితే........

మానసికి ఒత్తిడిలో ఉన్నప్పుడు పొట్టలోకి ఆహారం పంపితే అది విషంలా మారుతుందని యుఎస్ పరిశోధకులు అంటున్నారు. కోపంగా ఉన్న సమయంలో నోట్లో ఏ తిండి పదార్థాన్నీ పెట్టుకోవద్దని, జంక్ ఫుడ్ అస్సలు ఆరగించవద్దని హెచ్చరిస్తున్నారు. భావోద్వేగంలో ఉన్నప్పుడు హార్మోన్లు మెదడుకు కనెక్ట్ అయి ఉంటాయట. అటువంటి సమయంలో ఏ పదార్థాన్ని దేహంలోకి పంపినా అవి ఆక్సిడైజ్ అయ్యే అవకాశాలే ఎక్కువని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ప్రశాంతంగా ఉన్నప్పుడు తినటం మంచిదంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం ఒంటికి, మెదడుకు కూడా లాభం చేకూరుస్తుందంటున్నారు. టీవీ చూస్తూ తినటం వలన ఎక్కువ భోజనం చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రసారమవుతున్న కార్యక్రమ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఒక్కోసారి అలా చూస్తూ తినటం వలన భావోద్వేగానికో, ఆవేశానికో గురయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top