రిషికేష్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది ప్రకృతిశోభను సంతరించుకున్న సుందరమైన
పర్యాటక ప్రదేశం కూడ. ఇక్కడ అడుగడుగునా ఆలయాలు కనిపిస్తాయి. చిన్న పెద్ద
కలిసి రెండు వందల ఆలయాలు ఉండవచ్చు. ఇక్కడ అతి ప్రాచీన ఆలయం భరత్ మందిరం.
రిషికేష్లో సాక్షాత్తూ నారాయణుడు కొలువుదీరాడు. ఇక్కడ ఉన్న త్రివేణిఘాట్
అత్యంత ప్రసిద్ధి చెందింది. దీనిని గంగానది, గుప్త యమునానది, గుప్త సరస్వతి
నదులు సంగమ స్థానంగా చెబుతారు. శ్రీరాముడు ఈ ఘాట్లో స్నానాదికాలు
చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనికి సమీపంలో రిషికుండ్ ఉంది.
శ్రీరామచంద్రుడు ఈ ఆలయంలో రఘునాథుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఇంకా
భద్రకాళి, లక్ష్మణ, త్రయంబకేశ్వర, నీలకంఠ మహదేవుని మందిరాలు ఇక్కడ బహుళ
ప్రాచుర్యం పొందాయి.
రిషికేష్ చుట్టూ కొండలు ఉంటాయి. గంగానది ఉరకలు వేస్తూ జాలువారే దృశ్యం చూపరులను ఆకట్టుకుంటుంది. రామ్ఝాలా, లక్ష్మణ్ ఝాలా వంతెనలు రిషికేష్ ప్రాంతానికి వన్నె తెచ్చాయి. ఇక్కడ పరమార్థ నికేతన్, స్వర్గాశ్రమ్ వంటి ధామాలు ఆకర్షిస్తాయి.
రిషికేష్ క్షేత్రం ఉత్తరాంచల్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో హరిద్వార్కు 24 కి.మీ దూరంలో ఉంది.
రిషికేష్ చుట్టూ కొండలు ఉంటాయి. గంగానది ఉరకలు వేస్తూ జాలువారే దృశ్యం చూపరులను ఆకట్టుకుంటుంది. రామ్ఝాలా, లక్ష్మణ్ ఝాలా వంతెనలు రిషికేష్ ప్రాంతానికి వన్నె తెచ్చాయి. ఇక్కడ పరమార్థ నికేతన్, స్వర్గాశ్రమ్ వంటి ధామాలు ఆకర్షిస్తాయి.
రిషికేష్ క్షేత్రం ఉత్తరాంచల్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో హరిద్వార్కు 24 కి.మీ దూరంలో ఉంది.