మంచి నీళ్లు తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

మంచి నీళ్లు తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయన్న విషయం తెలిసిందే. ఈ లాభాల జాబితాలోకి కొత్తగా మరో అంశం వచ్చి చేరింది. కోపం రావడానికి, చిరాకు కలగడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ అని తమ పరిశోధనల్లో వెల్లడిచేశారు కనెక్టికట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. డీ హైడ్రేషన్ శాతం తక్కువగా ఉన్నా సరే మీ మూడ్ పై దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. అందులోనూ ఇది మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని సరిపడా మంచి నీళ్లని తాగితే మంచి మూడ్‌లో ఉండడమే కాక స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం కూడా వస్తుంది అంటున్నారు వాళ్లు.

శరీరంలో ఉండాల్సిన నీటి శాతంకంటే 1.5 శాతం తగ్గిపోయినా - అంటే మైల్డ్ డీహైడ్రేషన్ ఉన్నా యువతుల్లో తలనొప్పి, నీరసం, ఏకాగ్రత లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వచ్చి పడతాయి. ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుంది. మహిళలతో పాటు కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవాళ్లు, మారథాన్ రన్నర్స్ కూడా మంచి నీళ్ల విషయంలో జాగ్రత్తగానే ఉండాలంటున్నారు వాళ్లు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top