భద్రాచలానికి 40 కి.మీ దూరంలో పర్ణశాల ఉంది. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్న
దివ్యక్షేత్రం. సీతారాములు అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడ నివసించారని
చెబుతారు. ఈ ప్రాంగణంలో సీతాదేవి, ఆమెను ఎత్తుకెళ్లడానికి జంగందేవర వేషంలో
వచ్చిన రావణుని మూర్తులు ఉన్నాయి. సీతమ్మవారి పాదాలు, బంగారులేడి విగ్రహాలు
దర్శనమిస్తాయి. పర్ణశాల సమీపంలో రథగుట్ట ఉంది. దానిని రావణాసురుడు రథాన్ని
ఆపిన ప్రదేశం అంటారు. పర్ణశాలకు దగ్గరలో శబరివాగు ఉన్నాయి. శ్రీరాముని
అనుగ్రహంతో శబరి నదిగా మారిందంటారు. ఈ ప్రవాహం మధ్యలో చిన్న గుట్ట ఉంది.
దానిని సీతమ్మ స్నానం చేయడానికి కూర్చున్న ప్రదేశం అని చెబుతారు. ఇక్కడ ఆరు
అడుగుల పొడవు, ఏడు అడుగుల వెడల్పుతో నల్లని చార ఉంటుంది. దీనిని సీతాదేవి
చీర ఆరవేసిన ప్రదేశంగా భావిస్తారు.