మండుటేసవిలో చల్లటి పెరుగు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది.
- రెండు స్సూన్ల పెరుగులో ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను గోధుమ పిండి కలిపి మొహానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చెమట పొక్కులు పోయి మొహం తేటగా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు గోధుమపిండి బదులు శెనగపిండి కలుపుకోవాలి.
- ఎండవల్ల చర్మం కమిలిపోయినట్లయితే రెండు టేబుల్ స్పూన్ల టమోటారసంలో ఒక టేబుల్ స్పూను పెరుగు కలిపి మొహానికి, చేతులకు పట్టించి పావుగంట తర్వాత చల్లటినీటితో కడగాలి. ఎర్రబడిన చర్మం చల్లబడి మెత్తగా ఉంటుంది.