అమ్మ వచ్చింది... పుకార్లకు చైతూ చెక్‌

టాలీవుడ్‌ హీరో నాగచైతన్యకు తాజాగా టాప్‌ హీరోయిన్‌ సమంతతో వివాహ నిశ్చితార్థం అయిన విషయం తెల్సిందే. ఈ వివాహ నిశ్చితార్థంకు చైతూ తల్లి రాలేదని, ఆమెకు నాగార్జునతో స్టేజ్‌ షేర్‌ చేసుకోవడం ఇష్టం లేక పోవడం వల్లే ఆమె నిశ్చితార్థంకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. నాగార్జున, అమలల వల్లే ఆమెకు నిశ్చితార్థంకు రావాలని ఉన్నా కూడా రాకుండా దూరంగా ఉందని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్ని పుకార్లే అంటూ చైతూ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. 

CLICKHERE : చైతు పెళ్లికి మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరు ?

నేడు నాగార్జున తన నిశ్చితార్థంకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్‌లో విడుదల చేశాడు. ఆ ఫొటోల్లో తన తల్లి లక్ష్మితో కలిసి ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి. ఇక ఈ నిశ్చితార్థ కార్యక్రమంకు దగ్గుబాటి ఫ్యామిలీ ఏ ఒక్కరు కూడా రాలేదని అంతా అనుకున్నారు. కాని వెంకటేష్‌, సురేష్‌బాబు, రానా ఇలా అంతా కూడా చైతూ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొని సమంత, చైతూలను ఆశీర్వదించినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కినేని ఫ్యామిలీతో సంబంధం లేకుండానే చైతూ తల్లి లక్ష్మి దూరంగా ఉంటూ నిశ్చితార్థంలో పాల్గొని ఉంటుందని భావిస్తున్నారు. చైతూ పోస్ట్‌ చేసిన ఫొటోతో ఇప్పటి వరకు వచ్చిన పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top