మార్చి 31తో డెడ్ లైన్ ముగియనున్న తరుణంలో ఎక్కువమందిని ప్రైమ్ యూజర్లుగా మార్చుకునేందుకు జియో కొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్లాన్ చేస్తోంది జియో… దానిలో భాగంగా ఈ నెల 31 లోపు జియో ప్లాన్లను రీచార్జ్చేసుకునేవారికి ఎక్కువ డేటాను ఆఫర్ చేస్తోంది. తన కస్టమర్లకు కొత్త ఆఫర్లు తీసుకొచ్చింది రిలయన్స్ జియో… మార్చి 31లోపు రూ.149, ఆపై రీచార్జ్ చేసుకొనే వారికి ఉచితంగా 2 జీబీ, 5 జీబీ, 10 జీబీ డేటాను అందించనుంది… రూ.149 రీచార్జ్పై ప్రస్తుతం 2 జీబీ 4జీ డేటా ఇస్తుండగా… ఇప్పుడుఅదనంగా మరో 2 జీబీ డేటా ఉచితంగా అందివ్వనుంది జియో… రూ.303 రీచార్జ్ పై 28 జీబీ 4 డేటా ఇస్తుండగా… అదనంగా మరో 5 జీబీ ఉచితంగా ఇవ్వనుంది. రూ.499 రీచార్జ్ పై అదనంగా 10 జీబీ డేటా ఆఫర్ ప్రకటించింది. అంటే ఇకపై రూ.499 రీచార్జ్ పై సంవత్సరానికి 120 జీబీ డేటా ఉచితంగాఅందనుంది.
ఈ నెల 31లోపు రీచార్జ్ చేసుకున్నవారికే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. కాగా, తక్కువ సమయంలోనే 10 కోట్ల మందికి పైగా కస్టమర్లను సంపాదించుకున్న జియో… ఇప్పటి వరకు 2.7 కోట్ల మంది జియో ప్రైమ్ మెంబర్ షిప్ చేయించుకున్నట్టు తెలిపింది… ఆశించి స్థాయిలో కస్టమర్లురాకపోవడంతో ప్రైమ్ మెంబర్ షిప్ గడువును మరో నెల పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.