పేటీఎం కస్టమర్లకు శుభవార్త.. ఏంటో తెలిస్తే ఎగిరిగంతేస్తారు


లేటెస్ట్ గా paytm సంస్థ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది. మీ మొబైల్ ఫోన్ లో paytm యాప్ ఉంటే చాలు మీకు ఆటోమేటిక్ గా బీమా సదుపాయం కల్పిస్తోంది. ఈ యాప్ ఉన్న వాలెట్ పోయినా లేదా వాలెట్ నుంచి డబ్బు మీ అనుమతి లేకుండా మాయం అయినా అందుకు paytm ఇన్సూరెన్స్ ఇస్తోందని కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు అందరికీ ఇది వర్తిస్తుందని.. బీమా కోసం నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 

ఇవాల్టి నుంచే paytm యాప్ వాడుతున్న మొబైల్ ఫోన్లు అన్నింటికీ ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చేశారని ప్రకటించింది సంస్థ. ఈ ఇన్సూరెన్స్ ఏడాదికి ఒకసారి మాత్రమే క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంది.
ఎలా కంప్లయింట్ చేయాలి: paytmలోని డబ్బు మీ అనుమతి లేకుండా ట్రాన్సఫర్ అయితే వెంటనే పేటీఎం కస్టమర్ కేర్ కు కాల్ చేయాలి. నంబర్ 91-9643979797కు 24గంటల్లో కంప్లయింట్ ఇవ్వాలి. 

వెంటనే మీ అకౌంట్ ను బ్లాక్ చేస్తారు. అన్ని పరిశీలించిన తర్వాత ఐదు రోజుల్లో మీకు కొత్త పిన్ నంబర్ తోపాటు మీ డబ్బును మీ అకౌంట్ లోకి ట్రాన్సఫర్ అవుతుంది. ఇది కేవలం రూ.20వేల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది. ఇక మొబైల్ పోయినా.. దొంగతనం జరిగినా పోలీస్ స్టేషన్ లో FIR నమోదు కావాల్సి ఉంటుంది. దాని ప్రకారం కొత్త ఫోన్ ఇస్తారు.

జియో సిమ్‌ వినియోగదారులు ప్రైమ్‌ ప్లాన్‌లోకి మారాలంటే రూ.99 లను పేటీఎం ద్వారా చెల్లింపులు చేసేలా అవకాశం కల్పించింది. దానితోపాటు ప్రోమోకోడ్‌ వాడడంవల్ల మరో రూ.10 క్యాష్‌ బ్యాక్‌ కింద కూడా తిరిగి ఇవ్వనుంది. దానితోపాటు రూ.303 ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకోవాలన్నా ప్రోమోకోడ్‌ ద్వారా రూ.30 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top