టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో తరుణ్. ఇప్పుడు హీరోగా అవకాశాలు లేవుగాని ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అప్పట్లో ఆయన చేసిన నువ్వులేక నేనులేను సినిమా ఎంత పెద్ద హిట్ ఆ విషయం అందరికి తెలిసిందే. అందులో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. ఒకానొక సమయంలో తరుణ్తో విభేదాల వల్లే ఆర్తి అగర్వాల్ విషం తాగిందని ప్రచారం కూడా జరిగింది. ఈ విషయం గురించి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది తరుణ్ తల్లి, నటి రోజా రమణి.
నన్ను వాడుకోమన్నా వాడుకోలేకపోతున్నారు..!
తరుణ్, ఆర్తి అగర్వాల్ మంచి స్నేహితులనే విషయం నాకూ తెలుసు. అంతకు మించి వారి మధ్య ఎటువంటి రిలేషనూ లేదు. ‘నువ్వు లేక నేను లేను’ సినిమా వంద రోజుల ఫంక్షన్లో ఒకసారి ఆర్తితో మాట్లాడాను. ఆమె చాలా మంచి అమ్మాయి. అయితే ఆమె విషం ఎందుకు తాగిందో నాకు తెలియదు. నా కంటే మీడియాకు బాగా తెలుసు. అయితే ఆమె ఆత్మహత్యా ప్రయత్నానికి తరుణ్తో రిలేషన్షిప్ మాత్రం కారణం కాదు.
నిజానికి వారిద్దరూ ప్రేమలో ఉండి, పెళ్లి చేసుకోవాలనుకున్నట్టైతే వారు ఉన్న స్థాయికి మా సపోర్ట్ అవసరం లేదు. తరుణ్ నిజంగానే ఆర్తిని ప్రేమించినట్టైతే, మాకు చెప్పేవాడు. మేం కచ్చితంగా పెళ్లి చేసేవాళ్లం. వారి మధ్య అలాంటి రిలేషన్ లేదు. అందుకే ఆర్తి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తరుణ్తో ప్రేమలో ఉంటే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేదా’ అని తిరిగి ప్రశ్నించింది రోజా రమణి.