కమలా పళ్ళు, సిట్రస్ జాతికి చెందినవి. అందువల్ల వీటిలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది .అంతే కాకుండా వీటిని ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ,ఒక్కొక్క పండు చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి అనేక బెనిఫిట్స్ వున్నాయి. ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏమిటో ఒక సారి చుద్దాం.
1. వీటి రసానికి కొంచెం ఉప్పు లేదా పంచదార కలుపుకోని తాగితే నీరసం గా పోయి వెంటనే ఎనర్జీని పొందవచ్చు.
2. జలుబును నివారించటం లో కూడా కమలాపళ్ళు సహాయపడతాయి.
3. కామెర్లు వ్యాధి వున్న వారు కూడా ఈ పండ్లను రసాలులో భాగంగా తీసుకోవచ్చు.
4. ఈ పండ్ల తొక్కలను పారేయకుండా ఎండలో ఎండబెట్ట్తి పొడి చేసుకోని,ఈ పోడిని నీళ్ళలో కలుపుకోని స్నానం చేస్తే శరీరం నుంచి వచ్చే చెడు వాసనను పొగొట్టడమే కాకుండా శరీరాన్ని తాజాగా వుంచుతుంది.
5. వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతుంది.
6. దీనిలో వున్న పీచు పదార్దం మల బద్దకాన్ని దూరం చేస్తుంది.
7. జీర్ణ శక్తిని పెంచి అకలి పెరిగేలా చేస్తుంది.
8. శరీరాన్ని చల్లగా వుండేలా చేయడమే కాకుందా దాహాన్ని తగ్గిస్తుంది.
9. చర్మ వ్యాధులను దూరం చేస్తుంది.