జ్వరానికి లంఖణం పరమ ఔషదమని, జలుబు చేస్తే వేడి వేడి ఆహారం తీసుకోవాలని పెద్దవారు చెప్పుతూ ఉంటారు. అయితే వీటికి శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయా? దీనిపై అనేక బిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాదారణంగా జ్వరం వచ్చినప్పుడు ఆహారం తీసుకోకుండా ఉంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే జలుబు వచ్చినప్పుడఆహారం తీసుకుంటే ఉష్ణోగ్రత పెరిగి జలుబుపై పోరాడే శక్తి వస్తుంది.
అయితే దీనికి డచ్ పరిశోదకులు శాస్త్రీయమైన ఆధారాన్ని జోడించారు. ఆహారం తీసుకోవటం వలన రోగనిరోదక శక్తి పెరిగి జలుబుకు కారణం అయిన వైరస్ ని సమర్దవంతంగా ఎదుర్కొంటుంది. అదే విధంగా ఉపవాసం అనేది ఒక రకమైన రోగ నిరోధక సామర్ధ్యాన్ని పెంచి ఇన్ పెక్షన్ లపై పోరాడే శక్తిని పెంచుతుంది.
దీని వలన అనేక రకాల జ్వరాలను ఎదుర్కొనే శక్తి సొంతం అవుతుంది. అయితే కొంత మంది వైద్యులు మాత్రం జలుబు,జ్వరం వచ్చినప్పుడు ద్రవ ఆహారాలను తీసుకుంటూ విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి వచ్చినపుడు దాదాపు ఐదు నుంచి పది రోజుల వరకు వదలవు.