మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే...ట్రై చేయండి

ముఖం ప్రకాశవంతంగా,అందంగా కనిపించటానికి మార్కెట్ లో అనేక రకాల క్రిమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మన ఇంటిలో సహజంగా అందుబాటులో ఉండే వస్తువులతో ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు.

అరకప్పు పాలల్లో అరకప్పు శనగపిండి,ఒక స్పూన్ పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం,మెడకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. జిడ్డు చర్మం కలవారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.

ఒక దోసకాయ తీసుకోని దాని రసం తీసి దానిలో నాలుగు స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి బాగా పట్టించాలి. ఐదు నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ ప్యాక్ స్వేద రంద్రాలను శుభ్రపరచి బిగుతుగా ఉండేలా చేస్తుంది.

ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి ఐదు నిమిషాలతర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ చిట్కా పొడి చర్మం కలవారికి బాగాసహాయపడుతుంది.

అరకప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే,ఒక ఎ,ఇ విటమిన్ టేబ్లేట్స్ పొడిని వేసి బాగా కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం మీద ఉండే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top