కొందరు వయసు పెరిగినా కూడా చాలా యవ్వనంగా కనిపిస్తారు. వారి ముఖంపై ఒక్క ముడత కూడా కనిపించదు. అలాంటి చర్మం అందరూ కోరుకుంటారు, కానీ చాలామంది స్కిన్ కేర్ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. ఏజ్ పెరిగినా యవ్వనంగా కనిపించాలనుకునేవారు ఈ రెమెడీని తప్పక పాటించండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక పాన్లో రెండు టేబుల్ స్పూన్ల మెంతులను తేలిగ్గా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేయించిన మెంతులు, ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి, ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ మెంతులు-చియా సీడ్స్ పొడి, పావు టీ స్పూన్ జాజికాయ పొడి, సరిపడా పచ్చి పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళలోకి పోకుండా ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.
వారానికి రెండుసార్లు ఈ రెమెడీ పాటిస్తే అద్భుతమైన స్కిన్ కేర్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ రెమెడీ చర్మ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది, చర్మాన్ని యవ్వనంగా, మెరిసేలా చేస్తుంది, ముడతలు, చారలను అరికడుతుంది, సాగిన చర్మాన్ని బిగుతుగా మార్చుతుంది.
చర్మ రంధ్రాలను తెరిచి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. మెంతులు, చియా సీడ్స్ మొండి మచ్చలను నివారిస్తాయి. జాజికాయలోని యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడతాయి. మొత్తంగా, ఈ రెమెడీ మచ్చలేని, మెరిసే, యవ్వనమైన చర్మాన్ని సొంతం చేస్తుంది.