ఇటీవలి కాలంలో కంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. గతంలో కంటి సమస్యలు సాధారణంగా పెద్దవారిలోనే కనిపించేవి, కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఈ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యంగా, పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లో గడపడం కంటి సమస్యలకు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గంటల తరబడి గేమ్లు ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తుంటారు. ఎక్కువ సేపు స్క్రీన్ను చూడటం వల్ల సున్నితమైన కళ్లు దెబ్బతింటాయి,
దృష్టి బలహీనపడుతుంది. అంతేకాక, పెద్దలు ఉద్యోగ రీత్యా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్లను చూడటం వల్ల కూడా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. దీని వల్ల కంటి నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తి, కళ్లజోడు ధరించాల్సి వస్తుంది.
పోషకాహార లోపం కూడా కంటి సమస్యలకు ఒక కారణం. కొన్ని ఆహార పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. పోషకాలు అందించే ఆహారాలు తీసుకోవడం ద్వారా కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు, కళ్లజోడు ధరించే అవసరాన్ని తగ్గించవచ్చు.
ఇప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూద్దాం. క్యారెట్, రెడ్ బెల్ పెప్పర్స్, ఆకుపచ్చ కూరగాయలు వంటివి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి తరచూ తీసుకోవడం వల్ల కళ్లను యూవీ కిరణాల నష్టం నుంచి రక్షించడమే కాక, కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత వంటి వయస్సు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
క్యారెట్
క్యారెట్లలో విటమిన్లు ఎ, బీ, సీ, కే పుష్కలంగా ఉంటాయి. అలాగే, అనేక ఖనిజాలు కూడా నిండి ఉంటాయి. క్యారెట్లను క్రమం తప్పకుండా తినడం వల్ల దృష్టి మెరుగవడంతో పాటు రెటీనా బలోపేతమవుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు క్యారెట్లను తప్పనిసరిగా తీసుకోవ डం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
రెడ్ బెల్ పెప్పర్స్
రెడ్ బెల్ పెప్పర్స్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కంటి కణజాలాన్ని రక్షించడంలో సహాయపడతాయి మరియు వయస్సు సంబంధిత కంటి వ్యాధులను నివారించడంలో ఉపయోగపడతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.