Kesari 2 OTT: అక్షయ్ కుమార్ సినిమా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో..

ఓటీటీలో మరో ఆసక్తికర చిత్రం సిద్ధమవుతోంది. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిట్‌గా నిలిచి, రూ.150 కోట్ల వసూళ్లను సాధించింది. చాన్నాళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్షయ్ కుమార్‌కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చింది. 

ఈ చిత్రాన్ని తర్వాత తెలుగులో కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది, దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీ వైరల్‌గా మారింది.

జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని నేపథ్యంగా తీసిన సినిమా 'కేసరి చాప్టర్ 2'. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే కీలక పాత్రల్లో నటించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం మొదట హిందీలో ఏప్రిల్ 18న విడుదలై మంచి ఆదరణ పొందింది. 

నెల తర్వాత, మే 23న తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా, సామాన్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా జూన్ 13 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.

'కేసరి 2' కథ విషయానికొస్తే... 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ ఘటనకు కారణమైనవాడు అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ డయ్యర్. తన అధికారాన్ని ఉపయోగించి ఈ సంఘటన గురించి వార్తాపత్రికల్లో రాకుండా నియంత్రిస్తాడు. 

అలాగే, బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యుడైన భారతీయ న్యాయవాది శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)తో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని డయ్యర్ కోరతాడు.

అయితే, జలియన్ వాలాబాగ్ ఘటన గురించి పూర్తిగా తెలుసుకున్న శంకరన్, తన ఉద్యోగానికి రాజీనామా చేసి, జనరల్ మైకేల్ డయ్యర్ పై కేసు వేస్తాడు. దీంతో మైకేల్ డయ్యర్ తనను కాపాడుకునేందుకు న్యాయవాది నెవిల్లే మెక్ కిన్లే (మాధవన్)ని నియమించుకుంటాడు. జలియన్ వాలాబాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించాడు? చివరకు ఏమైంది? అనేది మిగతా కథ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top