
విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది.
సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.
సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ట్రైలర్ అమోఘమైన హైప్ను సృష్టించింది. కేవలం కంటెంట్తోనే ఈ స్థాయి ఆసక్తిని రేకెత్తించడం విశేషం. అడ్వాన్స్ బుకింగ్స్లో ఈ సినిమా దూసుకెళ్తోంది.
బుక్ మై షోలో ఇప్పటివరకు లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి, ఓవర్సీస్లోనూ టికెట్లు భారీగా అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఈ చిత్రం కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.
కింగ్డమ్ సినిమా కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో విజయ్ దేవరకొండ పాత్రలోని విభిన్న షేడ్స్ అబ్బురపరుస్తున్నాయి. ఆయన పోలీస్, స్పై, గ్యాంగ్ లీడర్గా, అలాగే ఒక రాజ్యానికి ఎంపరర్గా విభిన్న గెటప్లలో కనిపించనున్నారు.
సత్యదేవ్, విజయ్ అన్నదమ్ములుగా కనిపించనుండగా, వీరి మధ్య బంధం బలంగా ఉంటుందని, అదే సమయంలో వారు ప్రత్యర్థులుగా మారతారని ట్రైలర్ సూచిస్తోంది. ఇవన్నీ సినిమాపై హైప్ను మరింత పెంచుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషిక వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ తన కెరీర్లోనే అత్యధికంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం, ఇందులో కొంత లాభాల షేర్ రూపంలో ఉంటుందని తెలుస్తోంది.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి 7 కోట్లు, సత్యదేవ్కు 3 కోట్లు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్కు 10 కోట్లు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు 50 లక్షలు, ఇతర నటీనటులకు 2 కోట్లు, సాంకేతిక సిబ్బందికి 7.5 కోట్ల వరకు పారితోషికం అందినట్టు సమాచారం.
ఈ లెక్కన ఈ సినిమాకు పారితోషికాల కోసం సుమారు 60 కోట్లు ఖర్చయినట్టు తెలుస్తోంది. మొత్తం బడ్జెట్ 130 కోట్లుగా ఉందని టాక్ నడుస్తోంది. ఈ వివరాలలో నిజమెంతో తెలియాల్సి ఉంది.