కొంతమంది చెరుకును కాల్చి దాని రసాన్ని పిండి తాగుతుంటారు. ఇలా చేయకూడదు. ఇది వాతం చేస్తుంది. కంటి సమస్యలను కలిగిస్తుంది. చెరుకును తినేటప్పుడు, చెరుకు రసాన్ని తీసేటప్పుడు చెరుకు కొనల, మొదళ్లను, కణుపులను తీసివేసి మిగతా భాగాన్ని తినాలి. భోజనం చేసిన వెంటనే చెరుకు రసం తాగకూడదు. తాగితే ఆహారం సరిగా జీర్ణం కాదు.
యంత్రాల ద్వారా తీసిన చెరుకు రసాన్ని కొందరు తాగుతుంటారు. ఇందులో అనేక మలినాలుంటాయి. అందువల్ల దాన్ని తాసుకోరాదు. పిల్లలు పళ్లు పుచ్చుపట్టి నలుపెక్కి వుంటే చెరుకుని తిన్నప్పుడు పుచ్చిపోయిన పళ్లు తెల్లగా వస్తాయి.
చెరుకు రసాన్ని మధుమేహం, అజీర్ణం, ముక్కు సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, శరీరం వాపు వున్నవారు తాగకూడదు. ఐతే చెరుకు రసాన్ని ఎక్కువ తాగి ఇబ్బందిపడుతుంటే దానికి విరుగుడుగా సోపు గింజల రసం, అల్లపు రసం పనిచేస్తాయి.