బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించిన ఈ ఆఫర్ జియోకు కోలుకోలేని దెబ్బేనా?

జియో ప్రకటిస్తున్న ఆఫర్లతో టెలికాం రంగంలో డేటా వార్ రోజుకో కొత్త రంగు పులుముకుంటోంది. తమ కస్టమర్లను జియో ఎక్కడ ఎగరేసుకుపోతుందనన్న భావనతో ఇతర కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించిన డేటా ప్లాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. 333 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 3జీబీ డేటా చొప్పున మూడు నెలలకు 270 జీబీ 3జీ డేటా లభిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా ప్రకటించింది.

దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. బీఎస్‌ఎల్ తాజాగా మరో రెండు ప్లాన్స్‌ను కూడా ప్రకటించింది. దిల్ కుల్ కే బోల్ ప్లాన్ పేరుతో 349 రూపాయల ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. 349 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబీ 3జీ డేటా 71రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top