ఈ ఏడాది తెలుగులో ఏ హీరోయిన్ అగ్ర తాంబూలం అందుకోనున్నది? అని పరిశీలిస్తే.. అంతకుముందేడాది ‘జల్సా’తో, గతేడాది ‘కిక్’తో తన హవాను కొనసాగించిన ఇలియానా ఈ ఏడాది పూర్తిగా చతికిలపడిపోయింది. ఈ ఏడాది ఆమె నటించిన ‘సలీమ్’ పూర్తిగా నిరాశపరిచింది. ఇక 2009లో ‘మగధీర’తో అగ్ర స్థాయికి ఎగబాకిన కాల్కు కూడా ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు లేవు. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన త్రిషకు ఈ ఏడాది తెలుగులో విజయాలేమీ లేవు. నయనతార మాత్రం ‘అదుర్స్’, ‘సింహా’ చిత్రాలు సాధించిన విజయాలతో టాలీవుడ్లో తన స్థానం చెక్కుచెదరకుండా కాపాడుకోగలిగింది. శ్రీయ కూడా అంతే. ‘కొమరం పులి’ చిత్రంలో చేసిన ఐటం సాంగ్తో తన సొగసుల సత్తాను చాటుకుని, ‘డాన్ శీను’ చిత్రం సాదించిన విజయంతో ఇప్పట్లో టాలీవుడ్ నుంచి తాను నిష్ర్కమించేది లేదని ప్రకటించుకుంది.అయితే..
అగ్ర తాంబూలం అందుకునేదెవరు ? 2010 రివ్యూ
11:13:00 AM
Share to other apps