ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ను ఇక మీరు పళ్లబుట్టలో పెట్టుకోవచ్చు.పేరొందిన ఉద్యానవనశాస్త్రవేత్త హాజి కలీముల్లాఖాన్ కొత్త రకం జామను రూపొందించారు. దీనికి ఐశ్వర్యారాయ్ పేరు పెట్టారు.
ఇది యాపిల్ మాదిరి ఉంటుంది. మరింత తీపిగా ఉంటుంది.గుజ్జుకూడా అధికంగా ఉంటుంది.
ఇది రుచి వాసన చూపులలో భిన్నంగా ఉంటుందని సాంప్రదాయికజామ కానే కాదని కలీముల్లా చెప్పారు.
ఇందులో విత్తనాలు మెత్తగా ఉంటాయన్నారు. మామూలుజామలో విత్తనాలు పళ్లసందుల్లో ఇరుక్కుపోతాయి.
దీన్ని అభివృద్ధి చేసేందుకు తనకు 8 సంవత్సరాలు పట్టిందన్నారు. సేంద్రియ పదార్ధాలతోనే అభివృద్ధి చేసినట్లు చెప్పారు. క్రిమిసంహారిణిగా వేపనూనెను వినియోగించినట్లు వెల్లడించారు.