లిటిల్‌ ఫ్రాన్స్‌ ఆఫ్‌ ఇండియా. . పాండిచ్చేరి

రెండు దేశాల సంస్కృతులు, వేషభాషలు మనదేశంలో ఎక్కడైనా వాడుకలో ఉన్నాయంటే.. అది గోవా తరువాత పాండిచ్చేరి మాత్రమే. ప్రస్తుతం మనదేశలంలో ‘లిటిల్‌ ఫ్రాన్స్‌’గా కొనియాడబడుతోన్న పాండిచ్చేరి స్వాతంత్య్రానికి పూర్వం ‘ఫ్రెంచి కాలనీ’ అయిన పాండిచ్చేరిలో.. ఎన్నో గతవైభవ చిహ్నాలతో పాటు.. హిందూ సంస్కృతి మూలాలను కూడా తనలో నిక్షిప్తం చేసుకుంది. అగస్త్య మహర్షి ఆశ్రయం పొందిన స్థలంగా పురాణగాథలు వెల్లడి చేస్తున్న ఈ ప్రాంతం.. దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది.

తమిళంలో ‘పుదు - చ్చేరి’ అంటే ‘క్రొత్త - ఊరు’ అని అర్ధం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీనిని ఫ్రెంచివారు ‘కఠఛీజీఛిజ్ఛిటడ‘ అని పిలిచారు. ఎప్పుడో పొరబాటున ఆంగ్లంలో ’ఠ’ బదులు ’’ అని వ్రాయడం వల్ల దీనిని ఆంగ్లంలో ‘పాండిచ్చేరి’ అని పిలువడం మొదలయ్యిం దని అంటారు. తరువాత అదే పేరు వాడుకలోకి వచ్చిందట. ప్రస్తుతం ఆంగ్లంలో అధికారికంగా ‘పుదుచ్చేరి’ అని పేరు మార్చే ప్రయత్నం జరుగుతున్నది.

ఇదీ చరిత్ర...

పురాణకాలంలో ఇక్కడ అగస్త్యమహర్షి ఆశ్రమం ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒక సంస్కృత విద్యాలయం కూడా ఉండేదని కొన్ని పురాతన ఆధారాల వల్ల తెలుస్తోంది. క్రీశ 2 వ శతాబ్దంలో వ్రాయబడిన క్ఛటజీఞజూఠట జ టజ్ఛి ఉటడ్టజిట్చ్ఛ్చ ఖ్ఛ్చి లో ‘పొడుకె’ అనే వాణిజ్యకేంద్రం గురించి వ్రాయబడినది. ఇదే ప్రస్తుత పుదుచ్చేరికి 2మైళ్ళ దూరంలో ఉన్న ‘అరికమేడు’ అని ‘హంటింగ్‌ ఫోర్డ్‌’ అనే రచయిత అభిప్రాయం. అప్పటినుండి రోమ్‌ ప్రాంతంతో పుదుచ్చేరి దగ్గరి రేవులకు సముద్ర వర్తక సంబంధాలుండేవి. రోమ్‌కు చెందిన కొన్ని పాత్రలు అరికమేడులో త్రవ్వకాలలో బయటపడ్డాయి. క్రీశ 4 వ శతాబ్దానంతరం ఈ ప్రాంతం వరుసగా పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజుల రాజ్యాలలో భాగంగా ఉంది. 1673 లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ వారు ఇక్కడ నెలకొలిపిన వర్తక స్థావరం క్రమంగా ఫ్రెంచివారి అధికార కేంద్రమయ్యింది. తరువాత ఫ్రెంచి, బ్రిటిష్‌, డచ్‌ వారి మధ్య అధికారం కోసం జరిగిన అనేక యద్ధాలు, ఒప్పందా ల ప్రకారం పుదుచ్చే రి పై అధికారం మారుతూ వచ్చింది. 1850 తరువాత పుదుచ్చేరి, మాహె, యానాం, కరైకాల్‌, చందేర్‌ నగర్‌లు ఫ్రెంచివారి స్థావరాలుగా ఉన్నాయి. 1954 వరకు ఇదే పరిస్థితి సాగింది.

విభిన్న సంస్కృతుల సమాహారం...

భిన్న సంస్కృతులు కలిగిన విలక్షణ నగరం పాండిచ్చేరి. స్వాతంత్య్రానికి పూర్వం ఫ్రెంచి వారి ఏలుబడిలో ఉన్న ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఆ పోకడలు మనకు గోచరిస్తాయి. ఆనాటి వైభవ చిహ్నాలు.. గత చరిత్రకు సాక్ష్యాలుగా ఎన్నెన్నో కట్టడాలు ఇప్పటికీ పర్యాటకులను విశేషంగా ఉకట్టుకుంటున్నాయి. చదువుల కాణాచిగా, ఆధ్యాత్మికవాదుల మజిలీగా, ప్రకృతి ప్రేమికులకు విహార కేంద్రంగా భూలోకపు స్వర్గాన్ని తలపిస్తున్న ఈ అద్భుత ప్రదేశంగా పేరున్న పాండిచ్చేరిని మించిన ఆధ్యాత్మిక విహారకేంద్రం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో! దక్షిణ భారత దేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి (పుదుచ్చేరి).. పుదుచ్చేరి, కరైకాల్‌, యానాం, మాహె అనే నాలుగు విడి విడి జి ల్లా ల సముదాయం. వీటి లో పాండిచ్చేరి పట్ట ణం బంగాళాఖాతం తీరాన, తమిళనాడు రాష్ట్రం అంత ర్భాగంగా 293 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్త రించి ఉంది. కరైకాల్‌ బం గాళాఖాతం తీరంలో, తమిళనాడు రాష్ట్రం అంతర్భాగంగా 160 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.


అలాగే.. బంగాళాఖాతం తీరంలోనే, మన రాష్ట్ర అంతర్భాగంగా, కాకినాడకు సమీపంలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యానాం విస్తరించి ఉంది. ఇక చివరిదైన మాహె.. అరేబియన్‌ సముద్ర తీరాన 9 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పాండిచ్చేరిలోని నాలుగు జిల్లాల జనాభా మొత్తం సుమారు 10 లక్షలకు పైబడే ఉంటుంది.

ఇక్కడ చూడాల్సినవివే..

పాండిచ్చేరిలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో బీచ్‌, బొటానికల్‌ గార్డెన్‌, మ్యూజియం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెరినిటీ బీచ్‌. ఒకటిన్నర కిలోమీటర్లు పొడవుండే ఈ బీచ్‌ సౌందర్యం మాటల్లో చెప్పలేనిది. ఈ సెరినిటీ బీచ్‌లో ముఖ్యంగా రెండు చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో ఒకటి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం, మరొకటి యుద్ధ స్మారక చిహ్నం. బీచ్‌కు కొంచెం దూరంలో ఉండే లైట్‌ హౌస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇది 150 సంవత్సరాల క్రితం కట్టబడిందంటే నమ్మలేంట. పాండిచ్చేరి స్పెషాలిటీ ఒక్క బీచ్‌ మాత్రమే కాదు.. అనేక చారిత్రక కట్టడాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర, ఫ్రెంచ్‌ సంస్కృతి, పచ్చదనం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

తరువాత చెప్పుకోవాల్సింది.. బొటానికల్‌ గార్డెన్‌. దీన్ని ‘ఐలాండ్‌ ఆఫ్‌ పీస్‌’ అని పిలుస్తారు. 22 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ బొటానికల్‌ గార్డెన్‌ ప్రశాంతతకు, పచ్చదనానికి చిహ్నమని చెప్పవచ్చు. భారతదేశంలోని పూల మొక్కలే కాకుండా, విదేశాల నుంచి తెచ్చిన ఎన్నో రకాల పూల మొక్కలను ఇక్కడ మనకు దర్శనమిస్తాయి.

ఈ బొటానికల్‌ గార్డెన్‌లో ఓ ఆక్వేరియం కూడా ఉంది. అందులోని అరుదైన ‘ఆర్నమెంటల్‌ చేపలు’ భలే అందంగా అలరిస్తుంటాయి. పాండిచ్చేరికి వెళ్లేవారు ఈ గార్డెన్‌ను దర్శించకపోతే... వారి విహారం పూర్తి కానట్టే లెఖ్ఖ. ఇక్కడ మరో చెప్పుకోదగ్గ ప్రాంతం పాండిచ్చేరి మ్యూజియం. భారతి పార్కులోగల ఈ మ్యూజియంలోని శిల్ప సంపద ఒకదాన్ని మించి మరొకటి మనల్ని కట్టిపడేస్తుంది.
 

ఇలా వెళ్లాలి...
పాండిచ్చేరికి ఎలా వెళ్లాలంటే.. విమానంలో అయితే పాండిచ్చేరికి 135 కిలోమీటర్ల దూరంలో చెనై్న ఎయిర్‌పోర్టు ఉంది. ఇక్కడ నుండి విల్లుపురం రైల్‌ జంక్షన్‌ మీదుగా పాండిచ్చేరి చేరుకోవచ్చు. పాండిచ్చేరికి సమీపంలో విల్లుపురం, మధురై, త్రివేండ్రం.. రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ఈ మూడింటిలో ఎక్కడినుండైనా సులభంగా పాండిచ్చేరి చేరుకోవచ్చు.

   
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top