మొటిమలు వల్ల ముఖంపై పడ్డ మచ్చలు తగ్గాలంటే బాగా పండిన టొమాటోను ముక్కలుగా కోసి వాటిలో టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను ఓట్ మీల్ పౌడర్ లేదా అలోవెరా ఆకు జిగురును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మచ్చలున్న చోట అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కాటన్ తీసుకుని గోరువెచ్చని నీటిలో ముంచి ముఖాన్ని నెమ్మదిగా రబ్ చేస్తూ తుడవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.