బాగా డబ్బున్న ముగ్గురు పిసినారులు గుడికెళ్లారు.
పూజ అయ్యాక.. హారతి, దక్షిణ పళ్లెం పట్టుకుని భక్తజనం దగ్గరకు వస్తున్నాడు పూజారి.
ఆ దక్షిణ పళ్లెం తమ దగ్గరకి వచ్చేలోపు ఎలా పారిపోవాలా అని ముగ్గురు పిసినారులు ఆలోచించడం మొదలు పెట్టారు.
వారి దగ్గరికి రానే వచ్చాడు పూజారి.
ముగ్గురిలో ఒకడు స్పృహ తప్పి పడిపోయాడు. మిగతా ఇద్దరు అతడిని భుజాన వేసుకుని వెళ్లిపోయారు!