కావల్సినవి:
టమాటాలు- ఆరు, మినప్పప్పు- రెండుకప్పులు, బియ్యంపిండి- కప్పు, ఉప్పు- సరిపడినంత, జీలకర్ర- చెంచా. పచ్చిమిర్చి- నాలుగు, కరివేపాకు- నాలుగురెబ్బలు, ఎండుమిర్చి- రెండు, ఉల్లిపాయలు - రెండు, నూనె- అరకిలో
తయారీ:
మినప్పప్పును శుభ్రంగా కడిగి నానబెట్టాలి. మర్నాడు రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తరవాత టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలు తరిగి, అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, జీలకర్ర వేసి విడిగా మిక్సీలో రుబ్బి.. అందులో బియ్యం పిండి, మినప్పిండి కలిపి రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలియతిప్పాలి. పదినిమిషాలయ్యాక బాణలిలో నూనె పోసి వేడయ్యాక పిండిని వడల మాదిరి వేసి బంగారువర్ణంలోకి వచ్చాక దించేయాలి. వీటిని టమాటాలు, పచ్చిమిర్చితో అలంకరిస్తే చిన్నారులు ఇష్టంగా తింటారు.