నడివయసు మహిళల్లో.. మెనోపాజ్‌కు.. మేలైన పోషకాహారం

నడివయసు మహిళల్లో.. మెనోపాజ్‌ దశ అడుగుపెడుతోందంటే చాలు ఎన్నో సమస్యలు ఒక్కసారిగా చుట్టుముడతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే ఈ దశలో సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వల్ల సంతోషంగా ఉండొచ్చు. ముఖ్యంగా పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పండ్లు, కాయగూరల మోతాదుని పెంచాలి. విటమిన్లతో పాటు ఖనిజాలనీ సమృద్ధిగా తీసుకోవాల్సిన దశ ఇది. చాలామందిలో ఎముక సమస్యలు ఏర్పడతాయి కనుక.. విటమిన్‌ డి, క్యాల్షియంలని సమృద్ధిగా తీసుకోవాలి. ఒమెగా-6 ఉండే పదార్థాలని తినడం వల్ల హార్మోన్ల నియంత్రణ జరిగి చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది.
  •  అవిసె గింజల వల్ల కూడా హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. అవిసె గింజలని సూపులు, సలాడ్లపై పొడిగా చేసి చల్లుకొని స్వీకరించవచ్చు.

  • సోయా ఉత్పత్తులకు మెనోపాజ్‌ సమస్యలని తగ్గించే శక్తి అధికం. అందుకే సోయాతో చేసిన టోఫు, మీల్‌ మేకర్‌, గ్రాన్యుల్స్‌(పొడిని) ఎక్కువగా తీసుకోవాలి.
  • గుడ్డు, గోధుమ గడ్డిల్లో ఉండే విటమిన్‌ ఇ మెనోపాజ్‌ దశలో ఉన్నవారికి గుండెజబ్బులు తలెత్తకుండా చేస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top