ఇంకా 49వ బస్సు రాలేదు. ఇప్పటిదాకా 46 బస్సులే వెళ్లాయి

"అయ్యా! మెహిదీపట్నం వెళ్లడానికి ఏ నంబరు బస్సు ఎక్కాలి?'' అప్పుడే రైలు దిగిన పల్లెటూరి ఆసామీ, సిటీ బస్టాండులో అరటిపండ్లు అమ్మేవాడిని అడిగాడు.
"49 నంబర్ బస్ పోతది'' చెప్పాడు పండ్లవాడు.
2 గంటల తర్వాత -
"అదేంది, నువ్వు ఇంకా బస్సు ఎక్కలేదా? మెహిదీపట్నం బస్సులు చానా పోయినయ్ కదా'' ఆశ్చర్యంగా అడిగాడు పండ్లవాడు.
"ఇంకా 49వ బస్సు రాలేదు. ఇప్పటిదాకా 46 బస్సులే వెళ్లాయి'' అప్పుడే వచ్చి ఆగిన బస్సును 47 అని లెక్కబెడుతూ చెప్పాడు ఆసామి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top